ప్రముఖ నటి శ్రీదేవి మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన ప్రతి ఒక్కరు అది ముమ్మాటికి సహజ మరణం కాదనే వాదించారు. 2018 ఆగస్టు 24న శ్రీదేవి దుబాయ్లోని ఓ హోటల్ బాత్ టబ్లో మునిగిపోయి చనిపోయింది. ఈమె మృతిపై అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. శ్రీదేవిని ఎవరో చంపారని కొందరు అంటే.. తన భర్తే చంపి ఉంటాడని కొందరు అనుమానించారు. శ్రీదేవి మృతిపై బోనీకపూర్ ఎట్టకేలకు నోరు విప్పాడు. శ్రీదేవిది సహజ మరణం కాదని ఒప్పుకున్నాడు.
బోనీకపూర్ ఏం అన్నారో ఆయన మాటల్లోనే…
శ్రీదేవి మృతిపై నన్ను 48 గంటలు విచారించారు. అందుకే ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. నేను లై డిటెక్టర్ పరీక్షతో సహా అనేక పరీక్షలు చేయించుకున్నాను. చివరకు రిపోర్టులో అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని తెలిసింది.
‘ది న్యూ ఇండియన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. శ్రీదేవి మరణం సహజమైనది కాదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం. విచారణలో నేను 48 గంటల పాటు మాట్లాడాను. అందుకే ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. భారతీయ మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉన్నందున వారిని ఈ విధంగా విచారించాలని అక్కడి అధికారులు నాకు చెప్పారు. హత్యాయత్నం జరగలేదని తెలుసుకున్నారు. నేను లై డిటెక్టర్ పరీక్షతో సహా అనేక పరీక్షలు చేయించుకున్నాను. చివరకు రిపోర్టులో అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని తెలిసింది’ అని బోనీకపూర్ తెలిపారు.
శ్రీదేవి మరణానికి కారణం ఏంటి?
శ్రీదేవి అందంగా కనిపించేందుకు అనుసరించిన డైట్ వల్లే ఈ మరణం సంభవించిందని బోనీకపూర్ అన్నారు. శ్రీదేవి ఎప్పుడూ పస్తులుండేదట. స్క్రీన్పై అందంగా కనిపించాలని, మంచి బాడీ షేప్తో ఉండాలనే కోరికతో ఇలా డైట్ పాటించేది. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చాలాసార్లు స్పృహతప్పి పడిపోయింది. తనకు బీపీ తక్కువగా ఉందని వైద్యులు చెబుతూనే ఉన్నారు’ అని బోనీకపూర్ అన్నారు.
నాగార్జున సాక్ష్యం
శ్రీదేవి మరణానంతరం ఓదార్చడానికి వచ్చిన నాగార్జున కొన్ని సంఘటనను గుర్తు చేసుకున్నాడట. శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్లో ఉండగా సినిమా షూటింగ్లో బాత్రూమ్లో స్పృహతప్పి పడిపోయిందట. దీంతో ఆమె పన్ను విరిగిందని నాగార్జున చెప్పినట్టుగా బోనీ కపూర్ తెలిపాడు. ఇలాంటి డైట్ కారణంగానే ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుందని అన్నాడు.
శ్రీదేవి భోజనంలో ఉప్పు వాడేది కాదు. తన మరణానికి ఇది కూడా ఓ కారణమని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. బోనీ తన ఆహారంలో ఉప్పును ఉపయోగించమని వైద్యులతో శ్రీదేవికి చెప్పించినా ఆమె అది సీరియస్గా తీసుకోలేదు. తాను డిన్నర్కి బయటకు వెళ్లినప్పుడు కూడా ఉప్పు లేని ఆహారం అడిగేదని బోనీకపూర్ చెప్పాడు. మొత్తానికి ఇలా కఠినమైన డైట్ ఫాలో అవ్వడం వల్లనే శ్రీదేవి చనిపోయిందని బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చాడు.