RRR సినిమాతో ప్రపంచ స్థాయిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘దేవర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లోగా దేవర మూవీ షూటింగ్ను పూర్తి చేసి ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘వార్’ సినిమా నేటితో విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘వార్-2’ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ నటించనున్నారు. ఈ విషయాన్ని తరణ్ ఆదర్శ్ ట్విట్టిర్(X)లో వెల్లడించారు.
కాగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జనవరి 24, 2025లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్లు టాక్. వార్2లో ఎన్టీఆర్ పాత్ర ఏంటీ అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య సన్నివేషాలు నందమూరి ఫ్యాన్స్ను ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఆందోళన కలిగించే విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వార్-2’ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్తో పాటు మూడో హీరో కూడా ఉన్నాడని చర్చ నడుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు హీరోలు ఉంటే ఎన్టీఆర్కు సరైన పాత్ర దక్కదేమోనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముగ్గురు హీరోలు ఉండడం వల్ల సినిమాలో పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనలో అర్థముందని పలువురు అంటున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్, జాన్ అబ్రహం వంటి బాలీవుడ్ బడా హీరోకే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఆ యూనివర్స్లో నటిస్తున్న తొలి నటుడిగా ఎన్టీఆర్ రికార్డు నెలకొల్పనున్నాడు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన మూడో సినిమా ‘వార్’.
ఈ సినిమాలో హృతిక్ రోషన్తో పాటు టైగర్ ష్రాఫ్ నటించారు. 2019 అక్టోబర్ 2న విడుదలైన ‘వార్’ అప్పుడు సూపర్ హిట్ అందుకుంది. సరిగ్గా ఈ రోజుతో వార్కు నాలుగేళ్లు గడిచాయి. ఈ ఫ్రాంచైజ్లో వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా ‘పఠాన్’. ఈ సినిమా రూ.1000కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెరిపేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరీ ఈ యూనివర్స్లో ఎన్టీఆర్కు తిరుగులేదని తెలుస్తోంది.