Monday, July 1, 2024

OTT Movies : సినిమా షూటింగ్ మెుదలుకాకముందే సన్నీ డియోల్‌ సినిమాకు రూ.95 కోట్ల ఓటీటీ ఆఫర్

సన్ని డియోల్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్‌గా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గదర్ 2’. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేస్తూ.. కలెక్షన్స్‌తో దూసుకుపోయింది. భారత్, పాకిస్థాన్ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ఇప్పటికే.. కేజీఎఫ్‌ 2, బాహుబలి 2 రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పుడు పఠాన్‌ వసూళ్లను కూడా క్రాస్‌ చేసి బాలివుడ్‌ ఇండస్ట్రీలోనే సూపర్‌ హిట్‌గా నిలించింది.

తాజా అప్‌డేట్‌ ఏంటంటే.. సన్నీ డియోల్‌తో కలిసి అమీర్‌ఖాన్‌ కొత్త సినిమా తీయనున్నారు. ఆ మూవీ షూటింగ్‌ కూడా స్టాట్‌ అవలేదు. అప్పుడే ఆ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ మేకర్స్‌కు రూ. 95కోట్లకు ఆఫర్‌ చేసింది. సన్నీ డియోల్ హీరోగా అమీర్‌ఖాన్‌ ఆ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ డియోల్ ఇంకా ఆ మూవీకి సైన్‌ చేయలేదు, షూటింగ్‌ స్టాట్‌ అవలేదు, తేదీలు ఫిక్స్‌ చేయలేదు. కానీ డిజిటల్‌ రైట్స్‌ కోసం ఓటీటీ ఇంత మొత్తంలో ఆఫర్‌ చేయడం ఇప్పుడు సెన్సేషన్‌ అవుతోంది. ఈ సినిమాకు రాజ్‌ కుమార్‌ సంతోషీ కూడా సహకారం అందించన్నునారు. అక్టోబర్‌ 19న ఈ మూవీ అప్‌డేట్‌ వస్తుంది.

గదర్‌ 2 సృష్టించిన సంచలనం వల్లే సన్నీ డియోల్‌ రేంజ్‌ పెరిగిపోయింది. గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌ సినిమాలు పెద్దగా ఆడలేదు. హీరోగా ఈయన స్టార్ డమ్ ఎపుడో ఫేడౌట్ అయిపోయింది. అలాంటి సందర్భంలో గదర్ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గదర్ 2’ సీక్వెల్‌తో బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌ రేంజ్‌ పెరిగిపోయింది.

రాజ్‌కుమార్‌ సంతోషి, సన్నీ డియోల్‌ కాంబినేషన్‌లో వచ్చిన నాల్గవ చిత్రం గద్దర్‌ 2. గతంలో సన్నీ డియోల్‌ నటించిన ‘దామిని’, ‘ఘటక్’ మరియు ‘ఘాయల్’ చిత్రాలకు రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 23న జీ 5లో గద్దర్‌ 2 స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇక ఓటీటీలో కూడా రికార్డులను బ్రేక్‌ చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page